అష్టాదశ శక్తిపీఠాలు

1. శాంకరి(శ్రీలంక):-

ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

2. కామాక్షి :- కాంచీపురం, తమిళనాడు

మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3. శృంఖల (ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్): -

ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.



4. చాముండి ( క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక) :-

అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

5. జోగులాంబ(ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్) :-

కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.


6. భ్రమరాంబిక (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్):-

కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.


7. మహాలక్ష్మి ( కొల్హాపూర్, మహారాష్ట్ర) :-

ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.


8. ఏకవీరిక (మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర):-

ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.


9. మహాకాళి (ఉజ్జయిని, మధ్య ప్రదేశ్) :-

ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.


10. పురుహూతిక ( పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్):-

కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.


11. గిరిజ(ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా):-

వైతరిణీ నది తీరాన ఉన్నది.


12. మాణిక్యాంబ (దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్) :-

కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.


13. కామరూప (హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో):-

ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.


14. మాధవేశ్వరి (ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో):-

ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.


15. వైష్ణవి (జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్):-

ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.


16. మంగళ గౌరి (గయ, బీహారు) :-

పాట్నా నుండి 74 కిలోమీటర్లు.


17. విశాలాక్షి ( వారాణసి, ఉత్తర ప్రదేశ్.


18. సరస్వతి - జమ్ము- కాష్మీరు :-

అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.