1. శాంకరి(శ్రీలంక):-
ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.2. కామాక్షి :- కాంచీపురం, తమిళనాడు
మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.3. శృంఖల (ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్): -
ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
4. చాముండి ( క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక) :-
అమ్మవారు చాముండేశ్వరీ దేవి.5. జోగులాంబ(ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్) :-
కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
6. భ్రమరాంబిక (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్):-
కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
7. మహాలక్ష్మి ( కొల్హాపూర్, మహారాష్ట్ర) :-
ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
8. ఏకవీరిక (మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర):-
ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
9. మహాకాళి (ఉజ్జయిని, మధ్య ప్రదేశ్) :-
ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
10. పురుహూతిక ( పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్):-
కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
11. గిరిజ(ఓఢ్య, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా):-
వైతరిణీ నది తీరాన ఉన్నది.
12. మాణిక్యాంబ (దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్) :-
కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
13. కామరూప (హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో):-
ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
14. మాధవేశ్వరి (ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో):-
ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
15. వైష్ణవి (జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్):-
ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
16. మంగళ గౌరి (గయ, బీహారు) :-
పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
17. విశాలాక్షి ( వారాణసి, ఉత్తర ప్రదేశ్.
18. సరస్వతి - జమ్ము- కాష్మీరు :-
అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.
