ఇండియ‌న్ బ్యాంకులో 417 పీవోలు

ఇండియ‌న్ బ్యాంక్ ప్రొబేష‌నరీ ఆఫీస‌ర్ (పీవో) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఇండియ‌న్ బ్యాంక్ మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో ఏడాది వ్య‌వ‌ధి ఉన్న‌ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు. ఈ కోర్సును విజయ‌వంతంగా పూర్తి చేసినవారిని పీవోలుగా నియ‌మించ‌నున్నారు.

వివరాలు...
ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు
మొత్తం పోస్టుల సంఖ్య‌: 417
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 20 - 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: ఆన్‌లైన్ ఎగ్జామ్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో ప్రిలిమ‌న‌రీ, మెయిన్ ఎగ్జామినేష‌న్ రెండు ఉంటాయి.
ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ - ప్రిలిమ‌న‌రీ తేది: 06.10.2018
ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ - మెయిన్: 04.11.2018
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.100, ఇత‌రుల‌కు రూ.600.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 01.08.2018
చివ‌రితేది: 27.08.2018
Website